ఎన్నికల విధుల్లో వీఆర్ఏ మృతి
13:05 February 13
ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వీఆర్ఏ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో జరిగిందీ ఘటన.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో విషాదం జరిగింది. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుడు నరసింహులు సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా వీఆర్ఆఏ మృతి చెందారు.
ఇదీ చదవండి:
సమస్య చెప్పడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. మీరెవరో తెలియదన్న పోలీసులు!