ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీనివాసుని సన్నిధిలో ప్రముఖులు

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు.

By

Published : Jan 12, 2020, 2:10 PM IST

vips visits tirupati lord venkateshwara swamy temple
శ్రీనివాసుని సన్నిధిలో ప్రముఖులు

శ్రీనివాసుని సన్నిధిలో ప్రముఖులు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భాజపా అధికార ప్రతినిధి నితిన్‌ కోయల్‌, మాజీ ఎమ్మెల్యే అనిత, గాయని శోభారాజు, సంగీత దర్శకుడు తమన్‌, సింగర్స్‌ మోహనా, అదితి... శ్రీవారిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అమరావతిలో రాజధాని కోసం మహిళలు, రైతులు చేస్తున్న పోరాటంలో వారు గాయాల పాలవుతున్నారని... ఆ పరిస్థితి నుంచి వారిని రక్షించాలని స్వామివారిని వేడుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే అనిత తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ తీరును ఆమె విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details