చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన సుజిత (34), పలమనేరు కొలమాసనపల్లికి చెందిన మహేశ్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సుజిత యాదమరి మండలంలోని మాదిరెడ్డిపల్లిలో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేశారు. మహేశ్ కొలమాసనపల్లిలో పోస్టుమాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ దంపతులు.. ఎంజీఆర్ విధిలో నివాసం ఉండేవారు. కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. సుజిత ఒంటరిగానే జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిత్తూరు ఒకటో పట్టణ ఎస్సై మోహన్ కుమార్ తెలిపారు.