ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 10, 2021, 5:36 PM IST

ETV Bharat / state

కుప్పం పోలీసుల తీరుపై ఎస్‌ఈసీకు వర్ల రామయ్య ఫిర్యాదు

కుప్పం పోలీసుల తీరుపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ ఎస్‌ఈసీ చెప్పినట్లే అధికారులు నడవాలని.. ప్రస్తుతం డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థే నడుస్తోందని ఆరోపించారు.

varla ramiyya complaint to sec on kuppam police
varla ramiyya complaint to sec on kuppam police

చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసుల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. ఎన్నికల వేళ ఎస్‌ఈసీ చెప్పినట్లే అధికారులు నడవాలి కానీ.. డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థే నడుస్తోందన్నారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ ఎన్నికల నిబంధనలు మార్చారా అని నిలదీశారు.

'41 నోటీసు ఇవ్వకుండా తెదేపా నేతలను ఎలా అరెస్టు చేస్తారు? రాత్రి అరెస్టు చేసి ఈ మధ్యాహ్నం వరకు ఎక్కడ తిప్పారు? ఇతర ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలకు కుప్పంలో ఏం పని?' - వర్ల రామయ్య, తెదేపా నేత

ఇదీ చదవండి:

మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి..?: తెదేపా నేత అమర్నాథ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details