చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం వలసరెడ్డిగారిపల్లికి చెందిన రాజకీయ కురువృద్ధుడు, మాజీ జెడ్పీటీసీ వీ సిద్ధరామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఆయన సన్నిహితుడిగా మెలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సిద్ధరామిరెడ్డి సమీప బంధువు. ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా సేవలు అందించారు. స్వగ్రామైన వలసరెడ్డిగారిపల్లిలోనే ఎక్కువ ఉండేందుకు ఇష్టపడే సిద్ధరామిరెడ్డి, అక్కడే తుది శ్వాస విడిచారు. నేడు 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వలసరెడ్డిగారిపల్లి మాజీ జెడ్పీటీసీ మృతి - వలసరెడ్డిగారిపల్లి మాజీ జెడ్పీటీసీ మృతి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమీప బంధువు వీ సిద్ధరామిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. స్వగ్రామంలోనే ఉండేందుకు ఇష్టపడే సిద్ధరామిరెడ్డి అక్కడే చివరి శ్వాస విడిచారు.
![వలసరెడ్డిగారిపల్లి మాజీ జెడ్పీటీసీ మృతి valasareddigari palli ex zptc died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7146870-575-7146870-1589169777182.jpg)
వలసరెడ్డిగారిపల్లి మాజీ జెడ్పీటీసీ మృతి