ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1300 కార్మికులతో.. ఉత్తరప్రదేశ్​కు శ్రామిక్ రైలు - చిత్తూరు నుంచి స్వస్థలాలకు బయలుదేరిన యూపీ వలస కార్మికులు

చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పర్యవేక్షనలో ఉత్తరప్రదేశ్​కు చెందిన వలస కార్మికులు చిత్తూరు రైల్వే స్టేషన్​ నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. వీరందరికీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించుకున్నాకే.. రైలులో పంపించారు.

up migrate workers went to home town
చిత్తూరు నుంచి స్వస్థలాలకు బయలుదేరిన యూపీ వలస కార్మికులు

By

Published : May 12, 2020, 1:06 PM IST

Updated : May 12, 2020, 4:46 PM IST

చిత్తూరులో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను వారి స్వస్థలాలకు అధికారులు పంపించారు. చిత్తూర జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలలో ఉన్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను శ్రామిక్ ఎక్స్​ప్రెస్ రైలులో తరలించారు. 1300 మంది వలస కార్మికులతో చిత్తూరు రైల్వే స్టేషన్​ నుంచి రైలు బయలుదేరింది.

కార్మికులందరికీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే రైలులోకి అనుమతించారు. అందరికీ భోజనం, నీటి బాటిళ్లను అందజేశారు. రైలులో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రామిక్ రైలు ద్వారా వలస కార్మికులను తరలించే అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పర్యవేక్షించారు.

Last Updated : May 12, 2020, 4:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details