ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి బర్డ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి థావర్ - తిరుపతి బర్డ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి థావర్

చిత్తూరు జిల్లా తిరుపతిలోని బర్డ్స్ ఆసుపత్రిని కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోత్ సందర్శించారు. అక్కడ అందిస్తోన్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వైద్యసదుపాయాలపై ఆనందం వ్యక్తం చేశారు.

Union Minister Thavar Chand Gehloth visited the Bird's Hospital in Tirupati
చిన్నారితో మాట్లాడుతున్న కేంద్ర  మంత్రి థావర్ చంద్ గెహ్లోత్

By

Published : Jan 24, 2020, 8:43 AM IST

బర్డ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలపై కేంద్ర మంత్రి సంతృప్తి

తిరుపతిలోని బర్డ్స్ ఆసుపత్రికి అనుబంధంగా కళాశాల మంజూరుకు సహకరిస్తామని కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోత్ అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా....బర్డ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన... ఆసుపత్రి వర్గాలతో కలసి వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఆత్యాధునిక పరికరాల పనితీరు గురించి...వైద్యులు కేంద్ర మంత్రికి వివరించారు. తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్స్ సేవలు అద్భుతమని థావర్​ కితాబునిచ్చారు. కేంద్రం తరపున ఆసుపత్రి ఆధునీకరణ, వైద్యపరికరాల కోసం సహయ సహకారాలు అందిస్తామని గెహ్లోత్ స్పష్టం చేశారు. అనంతరం.... రాస్ సేవా సమితి ఆధ్వర్యంలో...మహిళలకు కారు డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. ఇలాంటి ఉపాధి కార్యక్రమాలు మహిళల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details