చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ముంగిలిపట్టు రైల్వేగేటు సమీపంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే లైన్మెన్ వీటిని గుర్తించి పాకాల రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీరిది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
రైలుపట్టాలపై గుర్తు తెలియని మృతదేహలు లభ్యం - రైలు పట్టాలపై గుర్తు తెలియని రెండు మృతదేహలు లభ్యం
చిత్తూరు జిల్లా ముంగిలిపట్టు రైల్వేగేటు దగ్గర రెండు మృత దేహాలు కలకలం రేపాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైలు పట్టాలపై గుర్తు తెలియని రెండు మృతదేహలు లభ్యం
TAGGED:
రైలుపట్టాలపై మృతదేహాలు......