ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మైనర్​ బాలికలు అదృశ్యం.. కేసు నమోదు

మదనపల్లిలో ఇద్దరు మైనర్​ బాలికలు అదృశ్యమయ్యారని వారి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : Jan 16, 2021, 9:54 PM IST

Published : Jan 16, 2021, 9:54 PM IST

minor girls missing in madanapalli
మదవపల్లిలో ఇద్దరు మైనర్​ బాలికలు అదృశ్యం

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరు మైనర్ బాలికలు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయింది. బాలికల బంధువులు, కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. ఈ నెల 12న వారు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు తెలిపారు.

మదవపల్లిలో ఇద్దరు మైనర్​ బాలికలు అదృశ్యం

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికలు కనిపించకపోవడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. బాలికల అదృశ్యంపై పోలీసులు వివరాలతో కూడిన ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details