ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి - chithore district crime news

రహదారిపై ఆగివున్న లారీని వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలోని లక్ష్మీపురం పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘర్షణ జరిగింది.

two members died in a road accident at laxmipuram chithore district
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం

By

Published : Apr 5, 2021, 10:47 PM IST

తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు సమీపంలోని ఈశంబాడి కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు.. సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై శ్రీరంగరాజపురం వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా లక్ష్మీపురం పెట్రోల్ బంక్ వద్ద చిత్తూరు-పుత్తూరు ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీ కొట్టారు.

ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీరంగరాజపురం పోలీసులు... సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి మృతులు తమిళనాడు ప్రాంతం ఈశంబాడి కాలనీకి చెందిన కిషోర్, సంపత్ గా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details