తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో... తితిదే మార్పులు చేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ విధిస్తున్న కారణంగా.. దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తితిదే వెల్లడించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నాం 12.45 వరకే దర్శనాలకు అనుమతి ఇస్తామని తితిదే తెలిపింది.
మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 4 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. సాయంత్రం 4 నుంచి 7.15 వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని తితిదే తెలిపింది. శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం సందర్భంగా 4.30 నుంచి రాత్రి 7.15 వరకు విరామం లేకుండా అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తితిదే అధికారులు వివరించారు.