ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోమందిరం పనుల్లో వేగం పెంచండి: తితిదే ఛైర్మన్ - తిరుపతిలో గోమందిరాన్ని సందర్శించిన తితిదే చైర్మన్

తిరుపతిలో నిర్మిస్తున్న గోమందిరాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు.. మొదట గోపూజ చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Ttd_Chairman
Ttd_Chairman

By

Published : Jun 9, 2020, 8:25 PM IST

రెండు నెలల్లో తిరుపతిలోని అలిపిరి వద్ద దాతల సహకారంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని పూర్తి చేస్తామని తితిదే పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోమందిరాన్ని పాలకమండలి సభ్యులతో కలిసి సందర్శించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

కరోనా కారణంగా ఇప్పటికే 3 నెలల పాటు నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు.. మొదట గోపూజ చేసుకుని వెళ్లేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details