సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా కారణంగా మాఢ వీధుల్లో వాహన సేవలు నిర్వహించలేమన్నారు. కొవిడ్ ప్రభావం తగ్గితే అక్టోబర్లో మాఢవీధుల్లో ఉత్సవాలు జరుపుతామని వెల్లడించారు.
తిరుపతిలో రేపటినుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బర్డ్ ఆస్పత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5 కోట్లు.. విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేశారు. తితిదే ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. కరోనా బారిన పడిన తితిదే ఉద్యోగుల వైద్య ఖర్చులు తితిదే భరించాలని నిర్ణయించారు.