ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి ముగిసినా... కొనసాగుతున్న పశువుల పండగ - cattle fight chandragiri mandal chittore news

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సంక్రాంతి అయిపోయినా.. పశువుల పండగ కొనసాగుతుంది. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు.

to continues Cattle Fair
సంక్రాంతి ముగిసినా కొనసాగుతున్న పశువుల పండగ

By

Published : Jan 19, 2020, 8:05 PM IST

సంక్రాంతి ముగిసినా కొనసాగుతున్న పశువుల పండగ

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ చివరి రెండు రోజులు పశువుల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి మాత్రం సంక్రాంతి పండుగ అయిపోయినా చంద్రగిరి మండలంలో పశువుల పండగ కొనసాగుతూనే ఉంది. పోలీసులు నామమాత్రంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మండలంలోని భీమవరం, చిన్న రామాపురం గ్రామాల్లో ఈ రోజూ పశువుల పండుగ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు పశువులకు కట్టిన పలకలను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. పలకలను స్వాధీన చేసుకున్న యువకుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details