బాలుడి కిడ్నాప్ కేసు: తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు తిరుపతిలో అపహరణనకు గురైన ఛత్తీస్గఢ్కు చెందిన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమయింది. బాలుడిని పోలీసులు...తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ చిన్నారిని చూసిన తండ్రి బావోద్వేగానికి గురయ్యాడు. బాలుడికి... పోలీసులు చాక్లెట్లు, బొమ్మలను బహుమతిగా ఇచ్చారు. తన కొడుకును అప్పగించినందుకు పోలీసులకు ఆ బాలుడి తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. కిడ్నాప్నకు సంబంధించిన వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వెల్లడించారు. కిడ్నాప్నకు గురైనా 14 రోజుల తర్వాత బాలుడి ఆచూకీ విజయవాడలో లభ్యమైందని ఎస్పీ తెలిపారు.
అసలేం జరిగిందంటే...
అలిపిరి బస్టాండ్ వద్ద గత నెల 27న ఛత్తీస్గడ్కు చెందిన ఆరేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. అప్పటి నుంచి తిరుపతి అర్బన్ పోలీసులు బాలుడి కోసం అన్వేషించారు. వి.కోట ప్రాంతానికి చెందిన శివప్ప కిడ్నాపర్ అని.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. తిరుపతిలో అపహరణకు గురైన బాలుడు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. విజయవాడ బస్టాండ్ పరిసరాల్లో బాలుడిని గుర్తించి.. చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించామన్నారు. అనంతరం తిరుపతి అర్బన్ పోలీసులకు, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: