ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడి కిడ్నాప్ కేసు: తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు - చిత్తూరు జిల్లా నేర వార్తలు

తిరుపతిలో అపహరణనకు గురైన ఛత్తీస్​గఢ్​కు చెందిన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమయింది. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని చూసిన తండ్రి బావోద్వేగానికి గురయ్యాడు.

బాలుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు
బాలుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు

By

Published : Mar 14, 2021, 9:48 PM IST

Updated : Mar 14, 2021, 10:01 PM IST

బాలుడి కిడ్నాప్ కేసు: తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

తిరుపతిలో అపహరణనకు గురైన ఛత్తీస్​గఢ్​కు చెందిన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమయింది. బాలుడిని పోలీసులు...తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ చిన్నారిని చూసిన తండ్రి బావోద్వేగానికి గురయ్యాడు. బాలుడికి... పోలీసులు చాక్లెట్లు, బొమ్మలను బహుమతిగా ఇచ్చారు. తన కొడుకును అప్పగించినందుకు పోలీసులకు ఆ బాలుడి తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. కిడ్నాప్​న​కు సంబంధించిన వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వెల్లడించారు. కిడ్నాప్​నకు​ గురైనా 14 రోజుల తర్వాత బాలుడి ఆచూకీ విజయవాడలో లభ్యమైందని ఎస్పీ తెలిపారు.

అసలేం జరిగిందంటే...

అలిపిరి బస్టాండ్‌ వద్ద గత నెల 27న ఛత్తీస్​గడ్​​కు చెందిన ఆరేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. అప్పటి నుంచి తిరుపతి అర్బన్ పోలీసులు బాలుడి కోసం అన్వేషించారు. వి.కోట ప్రాంతానికి చెందిన శివప్ప కిడ్నాపర్​ అని.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ​తిరుపతిలో అపహరణకు గురైన బాలుడు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. విజయవాడ బస్టాండ్ పరిసరాల్లో బాలుడిని గుర్తించి.. చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించామన్నారు. అనంతరం తిరుపతి అర్బన్ పోలీసులకు, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

తిరుపతిలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్‌ బాలుడు సురక్షితం

Last Updated : Mar 14, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details