తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కొవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకమని.. మేయర్ శిరీష అన్నారు. కమిషనర్ గిరీషాతో కలిసి శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలతో మేయర్.. సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇంటింటా చెత్త సేకరణ ప్రతిరోజు సక్రమంగా జరగాలన్నారు. యూజర్ ఛార్జీలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్లు ప్రతి షాపునకు తప్పనిసరిగా ఉండి తీరాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఏమైనా సమస్యలు ఎదురవుతుంటే తమ దృష్టికి కానీ లేదా స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధిత నగరంగానే తిరుపతి ఇప్పటికీ కొనసాగుతోందని.. ప్లాస్టిక్ను వినియోగించే వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
'కొవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకం' - తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ సమావేశం
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కొవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకమని.. మేయర్ శిరీష అన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలతో మేయర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
!['కొవిడ్ నియంత్రణలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకం' review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:01:30:1622208690-ap-tpt-13-28-tmc-mayor-commissioner-on-sanitization-av-3181980-28052021183812-2805f-1622207292-84.jpeg)
review