తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. కంపార్ట్ మెంట్లు బయట సుమారు కిలో మీటర్ భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుండగా... నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం వరకూ పడుతోంది. నిన్న 68వేల 779 మంది భక్తులకు స్వామివారి దర్శనప్రాప్తి కలిగింది. శ్రీవారి నిన్నటి హుండీ ఆదాయం 3కోట్ల 15లక్షలుగా ఆలయ అధికారులు ప్రకటించారు.
'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ' - swamy vaaru
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనానికి 30గంటలు, నిర్దేశిత టోకెన్లు పొందిన వారికి 4గంటల సమయం వరకూ పడుతోంది.
'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ'