ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహ వాహనంపై వీరలక్ష్మి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా సింహ వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.

By

Published : Nov 13, 2020, 10:18 PM IST

thiruchanur-sri-padmavati-ammavari-karthika-brahmotsavalu
వీరలక్ష్మి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహ వాహనంపై శ్రీపద్మావతి అమ్మవారు, వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అమ్మవారి వాహనసేవను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహ వాహనంపై అధిరోహించిన అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా ఐశ్వర్యం, యశస్సు, జ్ఞానం, ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

శ్రీవారిని దర్శించుకోనున్న కిషన్‌రెడ్డి..

తిరుమల చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రేపు ఉదయం ఆయన అధికారులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఇదీ చదవండి:

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం

ABOUT THE AUTHOR

...view details