తిరుపతిలోని మంగళం పరిధి బీటీఆర్ పురంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 19 ఏళ్ళ ఆ యువకుడు శుక్రవారం రాత్రి తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. కుటుంబ సమస్యలతోనే చనిపోయినట్లు ఇంటి సభ్యులు భావిస్తున్నారు.
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య - తిరుపతిలో యువకుడు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో యువకుడు బలవన్మరణం చెందిన ఘటన తిరుపతిలోని బీటీఆర్ పురంలో చోటు చేసుకుంది.

తిరుపతిలో యువకుడు ఆత్మహత్య
మద్యం, మత్తు, గేమింగ్ తదితర చెడు వ్యసనాలకు బానిసై.. ఇంట్లో వారితో తరచూ గొడవలకు దిగేవాడని.... ఈ క్రమంలోనే అడిగినవి ఇవ్వట్లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో ప్రిన్సిపాల్ మృతి