చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఎర్రకుంటలోని ఓ ఇంట్లో కొండచిలువ తిష్టవేసింది. ఇంట్లో కొండచిలువను చూసిన కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. కనకయ్య ఇంట్లోకి నిన్న రాత్రి చొరబడిన కొండచిలువ.. ఓ మూలకు చేరింది. అది గమనించిన ఇంటి సభ్యులు.. భయంతో రాత్రంతా పడుకోకుండా ఉండిపోయారు. ఉదయం అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేయటంతో వారు వచ్చి.. దాన్ని పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.
ఇంట్లోకి కొండచిలువ.. రాత్రంతా భయం గుప్పిట్లో కుటుంబం - today Python in the house news update
ఓ ఇంట్లో కొండచిలువ కనబడటంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రాత్రంతా జాగారం చేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది వచ్చి కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలి పెట్టారు.
ఇంట్లో తిష్ట వేసిన కొండ చిలువ
TAGGED:
Kondachiluva