ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

తిరుపతిలో పది మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అదుపులోకి తీసుకుంది. స్మగ్లర్లు అందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

By

Published : Dec 21, 2020, 9:42 AM IST

red sandal smugglers arrest
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

ఎర్రచందనం దుంగల కోసం శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న 10 మంది స్మగ్లర్లను ఎర్రచందనం ప్రత్యేక కార్యదళ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ రోడ్​ వద్ద రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్​ఫోర్స్ సిబ్బిందికి కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అప్రమత్తమైన సిబ్బంది, అడవిలోకి ప్రవేశించి.. 10 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గొడ్డళ్లు, రంపాలు, నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందినవారిగా గుర్తించినట్లు ఎర్రచందనం ప్రత్యేక దళం ఎస్పీ ఆంజనేయులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details