ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దీపావళి పర్వదినాన భక్తులతో కిక్కిరిసిన తిరుపతి ఆలయాలు

By

Published : Nov 14, 2020, 4:15 PM IST

దీపావళి కావడంతో తిరుపతిలోని పలు ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలు కేదారగౌరీ వ్రతం ఆచరించారు.

Temples in the city of Tirupati crowded with devotees
భక్తులతో కిక్కిరిసిన తిరుపతి నగరంలోని ఆలయాలు

తిరుపతి నగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీపావళి పర్వదినానం సందర్భంగా ఆలయాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మామిడితోరణాలు, పుష్పాలంకరణలతో శోభను సంతరించుకున్నాయి. కేదారగౌరీ వ్రతం నోచుకొనేందుకు తిరుపతిలోని వేషాలమ్మ ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వ్రతం ఆచరించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో నోములు నోచుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details