ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు నిత్యావసర వస్తువులు అందించిన ఉపాధ్యాయులు - వెదురుకుప్పం ఉపాధ్యాయుల సాయం

లాక్​డౌన్ వలన ఇంటికే పరిమితమైన పేద ప్రజలకు వెదురుకుప్పం ఉపాధ్యాయులు నిత్యావసర వస్తువులు అందజేశారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని వారు సూచించారు.

teachers helps to poor
పేదలకు నిత్యావసర వస్తువులు అందించిన ఉపాధ్యాయులు

By

Published : Apr 18, 2020, 5:07 AM IST

లాక్​డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన పేదలను ఆదుకునేందుకు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో 75 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించారు. నిత్యావసర వస్తువులను రెవెన్యూ అధికారులకు అందించి, వారి ద్వారా పేదలకు పంపిణీ చేయించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ, కరోనా వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వానికి సాయం చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details