ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2021, 9:01 AM IST

ETV Bharat / state

'ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా?'

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని నిలదీశారు.

tdp leader achennaidu fires on ysrcp
tdp leader achennaidu fires on ysrcp

ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గృహనిర్బంధించిన చిత్తూరు తెదేపా నేతలను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా అని నిలదీశారు.

ఎన్నికల్లో వైకాపా మంత్రులు చేసిన అక్రమాలు బయటపడతాయని భయమా అని ప్రశ్నించారు. వైకాపా అవినీతిని ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు వివరిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజల తరఫున నిలబడితే గృహనిర్బంధాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details