TDP EX MP AMARNATH REDDY : రాయలసీమకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం, ద్రోహం చేశారని టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా ప్రజలకు, యువతకి జగన్ అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని ఆక్షేపించారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని.. దీనిని యువత ఏమాత్రం క్షమించబోదన్న అమర్నాథ్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్ వీటిపై సమాధానం చెప్పాలన్నారు.
రాయలసీమకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారు: అమర్నాథ్ రెడ్డి - అమర రాజా
TDP EX MP AMARNATH REDDY FIRES ON CM JAGAN: రాయలసీమకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని.. ప్రాజెక్టులు పడకేశాయని, పరిశ్రమలు పారిపోతున్నాయని.. తెలుగుదేశం నేత అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. జగన్రెడ్డి పుణ్యమా అంటూ.. ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని విమర్శించారు. వీటిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.

TDP EX MP AMARNATH REDDY
రాయలసీమకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారు
అమర రాజా, జాకీ, కియా అనుబంధ పరిశ్రమలతో పాటూ మరెన్నో ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. రాయలసీమ ప్రాంతంలో గెలిచిన 49మంది వైసీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే వీటన్నింటిపైన ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని.. లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: