చిత్తూరు జిల్లా మదనపల్లిలోని గౌతమి నగర్ కాలనీలో సుగుణ అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కర్నూలుకు చెందిన చంద్రకాంత్ మదనపల్లి సబ్ జైల్లో వార్డెన్గా పని చేస్తున్నారు. తన స్నేహితురాలు కుమారుడు కేసు విషయంలో సుగుణ సబ్ జైలు వద్దకు స్నేహితులతో కలిసి వెళ్ళింది. ఈ నేపథ్యంలో.... అక్కడ పనిచేస్తున్న చంద్రకాంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజుల పాటు వీరిద్దరు సహజీవనం చేశారు. ఇటీవల సుగుణకు చంద్రకాంత్కు మధ్య గొడవలు జరిగాయి. గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో చంద్రకాంత్ ఇంట్లో ఉండగానే ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మదనపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి - మదనపల్లి వార్తలు
ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![మదనపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి Suspicious death of a woman in Madanapalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8759805-815-8759805-1599801626315.jpg)
మదనపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి