ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిస్థితుల ఆధారంగా వ్యవసాయానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి' - Agricultural Advisory Council in chittoor news

చిత్తూరు జిల్లాలోని భిన్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా వ్యవసాయ రంగంలో ప్రణాళికలు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్​గా నియమితులైన పాలేరు రామచంద్రారెడ్డి, మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు.

Suggestions by Minister Peddireddy
మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన వ్యవసాయ సలహామండలి చైర్మన్​

By

Published : Jun 12, 2021, 9:35 AM IST

చిత్తూరు జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్​గా నియమితులైన పాలేరు రామచంద్రారెడ్డి... మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు.

పరిస్థితులకు తగ్గట్టు రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మామిడి, టమాటా పంటలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించటం ద్వారా రైతులకు మేలు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి... వ్యవసాయ సలహామండలికి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details