ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 2, 2019, 10:07 AM IST

ETV Bharat / state

పాత బకాయిల కోసం చెరకు రైతుల ఆందోళన

పాత బకాయిలు చెల్లించాలంటూ తిరుపతిలో చెరకు రైతులు ఆందోళన చేపట్టారు.

చెరకు రైతుల ఆందోళన

చెరకు రైతుల ఆందోళన

ఆరు నెలలుగా చెరకు బిల్లులు చెల్లించకుండా చక్కెర కర్మాగార యాజమాన్యం కాలయాపన చేస్తుందంటూ చక్కెర రైతులు ఆందోళనకు దిగారు. తిరుపతికి చెందిన చక్కెర రైతులు మయూర చక్కెర కర్మాగారానికి ఒప్పందం ప్రకారం చెరకును సరఫరా చేసేవారు. గత ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం రైతులకు సరైన సమాధానం చెప్పకుండా ఉండిపోవటంతో విసుగెత్తిన రైతులు కర్మాగారానికి చెందిన మయూర హోటల్ ఎదుట ధర్నాకు దిగారు. ఆరు నెలలకు మూడు కోట్ల రూపాయల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details