ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృగాడికి మరణ దండనపై విద్యార్థుల ఆనందం - chittor girl rape and murder news

చిత్తూరు జిల్లాలో గతేడాది ఆరేళ్ల బాలికను హత్యాచారం చేసిన నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అనంతరం తమకు న్యాయస్థానాలపై మరింత విశ్వాసం పెరిగిందని తెలిపారు.

చిన్నారి హత్యాచారంపై కోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
చిన్నారి హత్యాచారంపై కోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

By

Published : Feb 25, 2020, 11:42 PM IST

కోర్టు తీర్పును స్వాగతిస్తూ విద్యార్థుల సంబరాలు

గతేడాది చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో చిన్నారి హత్యాచార ఘటనలో నిందితునికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని.. అయితే మరణ దండన త్వరితగతిన అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

కన్నీటి పర్యంతమైన నిందితుని తల్లి

హత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన నిందితుడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకు వివాహమైనప్పటి నుంచి తమ ఇంటికి రావడం లేదని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పు తమకు తెలియదని... కన్నతల్లిగా తాను బాధపడటం తప్ప చేసేదేమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details