Student Vanished In Flood Water: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగివస్తూ ఓ 9వ తరగతి విద్యార్థి సైకిల్తో సహా వాగులో కొట్టుకుపోయాడు. నక్కలవాగు గ్రామం వద్ద వాగులో విద్యార్థి గల్లంతయ్యాడు. గమనించిన తోటి విద్యార్థులు, స్థానికులు బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా..ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం అందటంతో గజ ఈతగాళ్లు, జేసీబీలతో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి సైకిల్ బయటపడగా..బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు.
గల్లైంతన విద్యార్థి కుంట్రపాకం గ్రామానికి చెందిన పృథ్వీరాజ్గా గుర్తించారు. 20 రోజుల క్రితం పీవీ పురం గ్రామానికి చెందిన సరళ అనే మహిళ కూడా ఇదే వాగులో గల్లంతయ్యింది. ఆమె ఆచూకీ ఇప్పటి వరకు లభించకపోవటంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.