ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీధి కుక్కల హల్​చల్.. భయాందోళనలో స్థానికులు - chandragiri locals angry on dogs

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శునకాల బెడదతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఓ బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

వీధి కుక్కల హల్​చల్.. భయాందోళనలో స్థానికులు
వీధి కుక్కల హల్​చల్.. భయాందోళనలో స్థానికులు

By

Published : Oct 8, 2020, 8:46 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శునకాలు వీరంగం సృష్టిస్తున్నాయి. భవానీనగర్​లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు గాయపడ్డాడు. కుక్కలు రోడ్ల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ అందరినీ భయపెడుతూ మీదికి ఎగబడుతున్నాయి. ఇళ్లలోకి సైతం చొరబడుతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఒక్కో కాలనీలో 15 నుంచి 25 వరకు..

ప్రధాన రోడ్లతో పాటు ఒక్కో కాలనీల్లోనూ 15 నుంచి 25 కుక్కల వరకు కలిసి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న వాహనదారులను వెంబడిస్తున్నాయి. శునకాలు గుంపుగా సంచరిస్తూ తమ మీదకి వస్తున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి సమయాల్లో అయితే..

రాత్రి వేళల్లో అయితే వాహనాల వెంటపడుతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు ఎం జరుగుతుందోనని భయపడుతున్నారు. కాలనీల్లో కుక్కల బెడద 5 నెలలుగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

ఇవీ చూడండి:

జగనన్న విద్యాకానుకతో పండగ వాతావరణం:ఉపముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details