ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన అర్చన కార్యక్రమాలు

By

Published : Dec 14, 2020, 6:20 PM IST

శ్రీకాళహస్తీశ్వరాలయంంలో 10 రోజులుగా చేస్తున్న లక్ష బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు ముగిశాయి. ఈ క్రమంలో పండితులు కలశ ఉద్వాసన చేపట్టారు. అనంతరం పూజా సామగ్రిని స్వర్ణముఖి నదిలో కలిపారు.

srikalahasti temple
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన అర్చన కార్యక్రమాలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లక్ష బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు ముగిశాయి. అర్చన కార్యక్రమాలను 10 రోజుల పాటు నిర్వహించిన పండితులు.. మంత్రోచ్ఛారణల మధ్య కలశ ఉద్వాసన చేపట్టారు. ఆలయంలో హోమ పూజల అనంతరం బిల్వ పత్రాలు, పూజా సామాగ్రితో ఉత్సవంగా వెళ్లి స్వర్ణముఖి నదిలో వాటిని వదిలారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details