ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్యాణ వెంకటేశ్వరస్వామికి భారీ విరాళం - శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య వార్తలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి వారి ఆలయానికి రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం కానుకగా అందింది. విశాఖపట్నానికి చెందిన ఎకో కార్బ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళాన్ని అందించింది.

Sri Kalyana Venkateswaraswamy temple in Srinivasamangapuram has been awarded as a gift of one kilo gold worth Rs.45 laks in chittoor
Sri Kalyana Venkateswaraswamy temple in Srinivasamangapuram has been awarded as a gift of one kilo gold worth Rs.45 laks in chittoor

By

Published : Mar 19, 2020, 10:44 PM IST

తితిదేకి అనుబంధంగా ఉన్న.. శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి రూ.45 ల‌క్ష‌లు విలువైన కిలో బంగారు వ‌డ్డాణం కానుక‌గా లభించింది. విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఎకో కార్బ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఎన్‌.కాళిదాస్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.భానుమ‌తి దాస్ ఈ కానుకను అందించారు. స్వామివారి మూలవిరాట్టుకి ఈ వ‌డ్డాణాన్ని అలంక‌రిస్తారు. కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవో ఎల్ల‌ప్ప, ప్రధానార్చకులు బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ రమణయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details