తిరుపతి పరిసర ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ నిఘా పెరిగింది. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. స్మగ్లర్లు జాడలపై టాస్క్ఫోర్స్ సిబ్బంది పడమటి మండలాలపై దృష్టిసారించారు. మంగళవారం ఉదయం 2 గంటల సమయంలో రెడ్డివారిపల్లె వద్ద అనుమానాస్పదంగా ఓ వాహనం కనిపించింది. టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంబడించి... ఆ కారును చుట్టుముట్టారు.
ఆ సమయంలో నలుగురు స్మగ్లర్లు సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. 30 దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు.