ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలంలో కూంబింగ్​.. 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్​

శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్​ అధికారులు కూంబింగ్​ నిర్వహించగా... స్మగ్లర్లు తారసపడి పరారయ్యారు. కారులో వదిలేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

smugglers-arrested-in-chittoor-district
శేషాచలం : కూంబింగ్​లో 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

By

Published : Jan 10, 2020, 11:52 PM IST

శేషాచలం : కూంబింగ్​లో 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా మారింది. నిరంతరం కూంబింగ్​ కొనసాగుతున్నా... వెరవక స్మగ్లింగ్​ కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి పోలీసులు కల్యాణి డ్యాం నుంచి భాకరాపేట వైపు కూంబింగ్​ చేపట్టారు. శుక్రవారం ఉదయం భాకరాపేటలోని చామల అటవీ ప్రాంతంలో నాగపట్న ఈస్ట్​ బీట్ వద్ద స్మగ్లర్ల అలికిడి వినిపించింది. వారిని పట్టకునే ప్రయత్నం చేయగా... స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయారు. అయితే అప్పటికే వారి సమీపంలోని వాహనంలో 15 దుంగలను లోడ్​ చేశారు. చుట్టు పక్కల సోదా చేసి పడేసిన నాలుగు దుంగలను వెతికి పట్టుకున్నారు. వాహనంలో చెట్లను నరకడానికి ఉపయోగించే రంపాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపులు చేపట్టారు. ఓ స్థానిక స్మగ్లర్​ని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details