చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవుల్లో కూంబింగ్లో భాగంగా భీమవరం అడవుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 ఎర్ర చందనం దుంగలు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో మంగళంపేట బీట్, పీలేరు రేంజ్ లారీ బాట వద్ద కొంత మంది ఎర్ర చందనం స్మగ్లర్లు రెండు కార్లలో దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వీరిని పోలీసు బృందాలు చుట్టు ముట్టి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసు సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు.
శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్, ఇధ్దరు స్మగ్లర్ల అరెస్ట్ - seshachalam forest latest news
శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రెండు కార్లు, అందులో ఉన్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
శేషాచల అడవుల్లో కూంబింగ్... ఇధ్దరు స్మగ్లర్లు అరెస్ట్