ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన కేసులో.. ఆరుగురు అరెస్టు - పుంగనూరు మర్డర్ కేసు

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన కేసులో ఆరుగురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. ఈ నెల 28న వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు.

six memberrs arrested in appiganipalli murder case
six memberrs arrested in appiganipalli murder case

By

Published : May 31, 2021, 12:53 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన కేసులో ఆరుగురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. ఈ నెల 28న గురుమూర్తి అనే వ్యక్తి గ్రామంలోని 60 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి చెవి కమ్మలు లాక్కొని తీవ్రంగా గాయపరిచాడు. అత్యాచారానికి యత్నించబోయాడు.

గమనించిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. తలపై బండరాయితో కొట్టిన కారణంగా.. గురుమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details