ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2021, 9:37 PM IST

ETV Bharat / state

RED SANDAL: రూ.40 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కరకంబాడీ పరిధి అడవుల్లో అక్రమంగా రవాణా అవుతున్న రూ.40లక్షలు విలువచేసే 23 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఒక నిందితున్ని పట్టుకున్నారు.

red sandalwood
ఎర్రచందనం దుంగలు

తిరుపతి సమీపంలోని కరకంబాడీ పరిధిలోని అడవుల్లో అక్రమంగా తరలిస్తున్న 23 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఒక నిందితున్ని పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.40లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

తిరుపతి అటవీ రేంజి పరిధిలోని కృష్ణాపురం సెక్షన్‌లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న ఎర్రచందనం ప్రత్యేక కార్యదళానికి.. స్మగ్లర్లు తారసడ్డారు. అప్పటికే నరికిన ఎర్ర చందన దుంగలను స్మగ్లర్లు ఎత్తుకెళుతూ.. పోలీసులను గమనించి దుంగలు పడేసి పారిపోయారు.

స్మగ్లర్లను వెంబడించిన పోలీసులు ఒక స్మగ్లర్‌ను పట్టుకున్నారు. స్మగ్లర్‌.. తమిళనాడు వేలూరు జిల్లా వసంతపురం గ్రామానికి చెందిన అన్నామలై లక్ష్మణన్​గా పోలీసులు గుర్తించారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.


ఇదీ చదవండి:red sandal: చెన్నైలో చిత్తూరు పోలీసుల తనిఖీలు.. రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details