కరోనా లాక్డౌన్తో సంఘటిత, అసంఘటిత అనే తేడాలేకుండా అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అభాగ్యులు, అనాథలకు ఉపాధిగా నిలిచిన చెత్త సేకరణపైనా లాక్డౌన్ ప్రభావం పడింది. చిత్తూరు జిల్లాలో ఊరూవాడా తిరిగి..... కాగితాలు, చెత్త సేకరించి అమ్ముకుని పొట్టపోసుకునేవాళ్లు.. చాలా మంది ఉన్నారు. లాక్డౌన్ సమయంలో వారంతా ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేసినా చెత్తసేకరణ ఆశించినంత సాగడంలేదు.
తిరుపతిలో 80 నంచి వంద తుక్కు సేకరణ దుకాణాలుండగా..గతంలో రోజుకు 20నుంచి 30లక్షల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ మేర వ్యాపారమేగగనమైందని వాపోతున్నారు. బేరాలు లేక దుకాణ యజమానులు.. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. మొన్నటివరకూ తిరుపతి సహా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తుక్కును చెన్నైకు తరలించారు. ఇప్పుడు చెన్నైలో మళ్లీ లాక్డౌన్ విధించడంతో పరిస్థితి మొదటికొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.