చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని సదాశివ రిజర్వాయర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు జలాశయం వద్దకు చేరుకున్నారు. అటవీ ప్రాంతంలోని కొండల్లో నుంచి రిజర్వాయర్కు నీరు చేరుతోంది. పూర్తిస్థాయిలో నిండిన జలాశయం నుంచి అలుగు ప్రవాహిస్తుండటంతో.. నీటిలో దిగి కేరింతలు కొడుతూ పర్యాటకులు సేద తీరారు. భారీగా వచ్చిన సందర్శకులతో ఆ ప్రాంతం అంతా రద్దీగా మారింది.
పర్యాటకులతో సందడిగా మారిన సదాశివ రిజర్వాయర్ - The bustle of tourists at the reservoirs news
ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాల కారణంగా జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు నిండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ జలకళ అందాలు చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
![పర్యాటకులతో సందడిగా మారిన సదాశివ రిజర్వాయర్ Sadasiva Reservoir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9947748-783-9947748-1608473955324.jpg)
పర్యాటకులతో సందడిగా మారిన సదాశివ రిజర్వాయర్