ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతి చెందిన వీర జవాన్లకు శాప్​ మాజీ ఛైర్మన్ నివాళి - news on india soldiers' deaths in chittore

చైనా దాడిలో మృతి చెందిన వీర జవాన్లకు శాప్​ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ నివాళులర్పించారు. దేశంపై విరుచుకుపడిన చైనాకు తగిన బుద్ధి చెప్పేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు.

saap ex chairman tributes to india soldiers' deaths
మృతి చెందిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తోన్న శాఫ్ మాజీ ఛైర్మన్

By

Published : Jun 17, 2020, 5:49 PM IST

చైనా దొంగ దెబ్బతో వీరమరణం పొందిన భారత జవాన్లకు శాప్​ మాజీ ఛైర్మన్ పీఆర్​ మోహన్ నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భారత్​పై తెగబడిన డ్రాగన్​కు బుద్ధి చెప్పే దిశగా భారతీయులు అడుగులు వేయాలన్నారు. చైనా వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాప్​ మాజీ ఛైర్మన్ డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details