ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్.. అక్కాతమ్ముళ్లు మృతి - road accident news at renigunta

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన అక్కతమ్ముళ్లు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

road accident news at renigunta chittoor district
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్.. అక్కాతమ్ముళ్లు మృతి

By

Published : Jan 22, 2021, 2:07 PM IST

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా తమ్ముళ్లు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాజులమండ్యం పోలీసులు తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

శ్రీవారి దర్శనానంతరం తిరిగి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. టిప్పర్​ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. రెండు సంవత్సరాల పాపకు తీవ్ర గాయాలవ్వటంతో.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details