ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RED SANDAL SEIZE : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టివేత

By

Published : Oct 30, 2021, 2:34 AM IST

Updated : Oct 30, 2021, 6:33 AM IST

చిత్తూరు జిల్లా తొట్టంబేడులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన దుంగల విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

అక్రమంగా తరిలిస్తున్న ఎర్రచందనం దుంగల పట్టివేత
అక్రమంగా తరిలిస్తున్న ఎర్రచందనం దుంగల పట్టివేత

చిత్తూరు జిల్లా తొట్టంబేడు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా... తమిళనాడుకు చెందిన ఓ కారు వేగంగా వెళ్లడంతో బుచ్చినాయుడు కండ్రిగ చెక్​పోస్ట్ వద్ద కారును అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా... రూ. రెండు లక్షలు విలువైన 38 ఎర్రచందనం దుంగలను అధికారులు సీజ్ చేశారు. కారునూ స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. కారు డ్రైవర్​ పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు వివరించారు.

Last Updated : Oct 30, 2021, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details