ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాదిలోగా ''చిత్తూరు ఇంటింటికీ నీరు''!

పుట్టపర్తి నగర పంచాయతీలో రూ.101 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకానికి చీఫ్​విప్ పల్లె రఘునాథరెడ్డి భూమి పూజ చేశారు.

By

Published : Feb 18, 2019, 5:25 PM IST

మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి
చిత్తూరు జిల్లా పుట్టపర్తి ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందడుగు పడింది. ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో రూ.101 కోట్లతో సురక్షిత మంచినీటి పథకానికి చీఫ్​ విప్ పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తిలో భూమిపూజ చేశారు. ఏడాదిలో ప్రతీ ఇంటికి నీరిందిస్తామన్నారు. పుట్టపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కరవు ప్రాంతమైన అనంతపురానికి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని చెప్పారు. 6 వందల కోట్లతో నియోజకవర్గంలోని పలు చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details