ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్ - నేడు చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్ వార్తలు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనకు చిప్పిలి హెలిపాడ్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

నేడు చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్
నేడు చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్

By

Published : Feb 7, 2021, 4:57 AM IST

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో రానున్న ఆయనకు చిప్పిలి హెలిపాడ్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌ వద్దకు రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడ భారత్‌ యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సత్సంగ్‌ విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సదుం మండలం పీపుల్స్‌గ్రోవ్‌ స్కూలుకు చేరుకుని విద్యార్థులతో ముచ్చటిస్తారు.

పాఠశాల సందర్శన ముగించుకున్న అనంతరం...రాష్ట్రపతి హెలికాప్టర్​లో బెంగళూరు విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details