ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2021, 9:26 PM IST

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జోరుగా ప్రసాదాల తయారీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులకు అందించే ప్రసాదాల తయారీ వేగంగా జరుగుతోంది.

Preparation of  prasadam
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జోరుగా ప్రసాదాల తయారీ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రసాదాల తయారీ జోరుగా సాగుతోంది. ఉత్సవాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారికి అవసరమైన ప్రసాదాల తయారీ పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రధానంగా మహాశివరాత్రి, రథోత్సవం, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాలకు లక్షకుపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికనుగుణంగా లడ్డూ, వడ, జిలేబి ఎక్కువ మొత్తంలో తయారుచేసి నిల్వ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details