చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా నిర్వహించిన త్రీకే రన్ ఉత్సాహ భరితంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్రెడ్డి హాజరయ్యారు. జనవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ జరగనుందని డీఐజీ క్రాంతి రాణా టాటా చెప్పారు. మీట్లో ఏపీ పోలీసు శాఖలోని అన్ని విభాగాలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రధానంగా సైబర్ క్రైమ్, టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఉంటుందని.. విద్యార్థి బృందాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉత్సాహభరితంగా 3కే రన్.. హాజరైన పోలీసు అధికారులు - చిత్తూరు జిల్లా పోలీస్ 3కె రన్ న్యూస్
వచ్చే నెల్లో ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన 3కే రన్ ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఉత్సాహభరితంగా 3 కె రన్