చిత్తూరు జిల్లా మురుకంబట్టులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వ్యక్తులు పట్టుబడ్డారు. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న రెండు కార్లను ఆపి తనిఖీలు నిర్వహించగా.. అందులో 22 ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాటి బరువు 640 కిలోలు కాగా... విలువ రూ.26 లక్షలు ఉంటాయని జిల్లా ఏఎస్పీ కృష్ణార్జునరావు తెలిపారు. అనంతరం రెండు కార్లను స్వాధీనం చేసుకుని..కందస్వామి, అండి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు.
26లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత - a grade of red sandalwood
తిరుపతిలో వాహన తనిఖీలలో భాగంగా ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police have seized a grade of red sandalwood as part of vehicle inspections in Tirupati in chittore district