ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలేశుని భక్తులు... క్యూలైన్లలో పడిగాపులు

వేసవి సెలవులు ముగుస్తుండడం, అన్ని పరీక్షా పలితాలు వెలువడుతున్నందున తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుకొండల వాడి చెంతకు చేరుకుంటున్నారు. క్యూలైన్లలో వేలాది మంది యాత్రికులకు అన్నపానీయాలు అందక... ఉక్కపోత సమస్యతో అల్లాడిపోయారు.

By

Published : Jun 2, 2019, 11:46 PM IST

క్యూలైన్లలో కష్టాలు

క్యూలైన్లలో కష్టాలు

వేసవి సెలవులు ముగుస్తున్నందున తిరుమళేశుని దర్శనానికి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. కొన్ని రోజుల నుంచి రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్‌మెట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం వెలుపల దాదావు 3 కిలోమీటర్లకు పైగా క్యూలైను లేపాక్షీ కూడలి వరకు చేరింది.

యాత్రికులు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు క్యూలో నిల్చోని నిరీక్షించాల్సి వచ్చింది. సమయానికి అన్నపానీయాలు అందక, క్యూలైన్లలో ఫ్యాన్‌లు లేక ఉక్కపోతతలో అల్లాడిపోయారు. చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 10 గంటల సమయం వేచి ఉన్నప్పటికీ క్యూలైను ఎంతకీ ముందుకు సాగక ఆనేక మంది దర్శనంకు వెళ్లకుండా వరుసల్లో నుంచి వెలుపలికి వచ్చేశారు. అగ్రహించిన భక్తులు తితిదేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. త్వరగా దర్శనం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు.

మరోవైపు క్యూల వద్ద పారిశుద్ధ్య కార్మికులు, శ్రీవారి సేవకులు తప్ప అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగా భక్తులు మండిపడ్డారు. గదుల కేటాయింపు, తలనీలాలు సమర్పించే కేంద్రాల వద్ద గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

మే నెలలో 25 లక్షల 82 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం కూడా రద్దీ కొనసాగింది. భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 66,683 మంది భక్తులు దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details