ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసులు దూషించారనే కారణంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 19, 2020, 2:20 PM IST

పోలీసులు అకారణంగా తిట్టారనే కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లా తెట్టు గ్రామంలో జరిగింది. ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు దూషణలకు దిగారని.. అందుకే మనస్తాపంతో బలవన్మరణానికి యత్నించాడని బాధితుని కుటుంబసభ్యులు తెలిపారు.

person suicide attempt
పోలీసులు దూషించారనే కారణంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

పోలీసులు దూషించారంటూ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. బాధితుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తిట్టారనే కారణంతో కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన సుధాకర్ ఆత్మహత్యకు యత్నించాడు. తన పక్క పొలం వ్యక్తి జేసీబీతో మట్టిని తన పొలంలోని వేస్తుండగా సుధాకర్ అడ్డుకున్నాడు. మట్టి వేయొద్దని చెప్పినా వినకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మట్టి వేస్తున్న వ్యక్తిని ఆపకపోగా సుధాకర్​ను దూషించారని బాధితుని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన అతను పురుగులమందు తాగాడు. అతనిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న మాలమహానాడు నాయకులు ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. సంఘటన వివరాలు తెలుసుకున్నారు. దీనికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

'వెంటాడే చేదు జ్ఞాపకం దివిసీమ ఉప్పెన'

ABOUT THE AUTHOR

...view details